మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గత 12 రోజులుగా ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరుపుతుంది. కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో ఈ కేసుకు సంబంధించి పలువురిని వరుసగా విచారిస్తున్నారు. మంగళవారం నాడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతను దాదాపు మూడు గంటల పాటుగా సీబీఐ అధికారులు విచారించారు. హత్య జరిగిన రోజు నుంచి జరిగిన పలు అంశాలపై ఆమెను సీబీఐ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజున పులివెందులకు చెందిన వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించనున్నారు. అలాగే గతంలో ఈ కేసులో సిట్ నిర్వహించిన దర్యాప్తు నివేదికను కూడా సీబీఐ అధికారులు పరిశీలించారు. మొత్తం 15 మంది కీలక అనుమానితులను గుర్తించినట్టు సమాచారం. వీరందరిని సీబీఐ అధికారులు వరుసగా విచారించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu