ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే నెలలో దావోస్లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యుఇఎఫ్) వార్షిక సదస్సులో సీఎం పాల్గొననున్నారు. మే 22 తేదీన దావోస్కు వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్, అక్కడ వారం రోజుల పాటుగా పర్యటించనున్నారు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఈ డబ్ల్యుఇఎఫ్ సదస్సుకు హాజరయ్యే వివిధ ప్రపంచదేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులుకు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వైఎస్ జగన్ వివరించే అవకాశం ఉంది. ఈ సదస్సుకు పలు ప్రపంచదేశాల అధినేతలు, నాయకులు, ప్రతినిధులు కూడా హాజరుకానున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ