ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12న ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం), శాసనమండలి రద్దుతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని మోదీకి వివరించారు. కాగా నేడు(ఫిబ్రవరి 14, శుక్రవారం) ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని వివిధ అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనను ముగించుకుని తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు.
[subscribe]