ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఆగస్టు 26, శుక్రవారం) విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖలో సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్ధ పార్లే ఫర్ ది ఓషన్స్తో ఒప్పంద కార్యక్రమం, అలాగే గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్ధ శిక్షణ ఇచ్చిన 5 వేల మందికి ధ్రువపత్రాలను అందించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు.
ముందుగా ఉదయం 8.30 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి, 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. 10.20-11.13 గంటల వరకు ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్ ది ఓషన్స్ మధ్య అవగాహనా ఒప్పంద కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత అక్కడినుంచి బయలుదేరి సిరిపురం ఏయూ కాన్వొకేషన్ హాల్కు సీఎం చేరుకుంటారు. 11.23-12.10 గంటల వరకు మైక్రోసాఫ్ట్ సంస్ధ శిక్షణ ఇచ్చిన విద్యార్ధులకు సీఎం ధ్రువపత్రాలను అందించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో ముఖాముఖి, అనంతరం సీఎం ప్రసంగం ఉండనుంది. ఈ కార్యక్రమం పూర్తయ్యాక 12.40 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం వైఎస్ జగన్ చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY