లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లాలనుకున్నా వారు వెంటనే స్పందన వెబ్ సైట్ లో సమాచారాన్ని నమోదు చేసుకోవాలని, దీంతో తరలింపు ప్రక్రియ సులభం అవుతుందని కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు పేర్కొన్నారు. అలాగే ఏపీకి చెందిన వలస కార్మికుల సమాచారం అందించాల్సిందిగా పలు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసినట్టు తెలిపారు. తమిళనాడు, రాజస్థానులో ఏపీకి చెందిన వారు ఎక్కువమంది రిజిస్టర్ చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ల నుంచి అనుమతి పాసులు లేకుంటే ప్రత్యేక రైళ్లల్లో ఎవ్వర్నీ అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు. ముందుగా 20 మందికి పైగా ఉన్న విద్యార్ధులు, యాత్రీకులు బృందాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి పత్రాలతో వచ్చే వారిని ఏపీలోకి రానిస్తామని తెలియజేశారు.
వెబ్ సైట్ లో వివరాల నమోదుకు స్టెప్స్:
వెబ్ సైట్ లింక్: http://spandana1.ap.gov.in/Registration/onlineRegistration
- ముందుగా వెబ్ సైట్ లో ఏపీకి రావాలనుకుంటున్నారా, వేరే రాష్ట్రానికి వెళ్లాలనుకుంటున్నారా సెలెక్ట్ చేసుకోవాలి.
- పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, జెండర్, వయస్సు నమోదు చేయాలి.
- ఏపీ నుంచే వెళ్లాలనుకుంటే ఎక్కడఉంటున్నారో వివరాలు నమోదు చేయాలి.
- ఏపీకి రావాలనుకుంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడఉంటున్నారో వివరాలు నమోదు చేయాలి.
- ప్రయాణానికి గల కారణాలు నమోదు చేయాలి.(ఉదా: వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు…)
- ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలి.
- ఎంతమంది సభ్యులు ఉన్నారో సంఖ్య తెలియజేయాలి.
- ఆన్ లైన్ ఫారం యొక్క పూర్తివివరాలు నమోదు చేసి సమర్పించిన అనంతరం సంబంధిత అధికారులు వెంటనే సంప్రదించి ప్రయాణాలకు అనుమతులు జారీ చేసి, ఏర్పాట్లు చేస్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu