ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణిత సమయంలో పూర్తిచేసేందుకు కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14, సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు సీఎం వైఎస్ జగన్ కీలక సూచనలు చేయనున్నారు. పనులు జరుగుతున్న తీరు, పూర్తైన నిర్మాణాలను స్వయంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత అక్కడి సమావేశ మందిరంలో పనులు పురోగతి, ఇతర అంశాలపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా సీఎం వైఎస్ జగన్ సోమవారం ఉదయం 10.30 గంటలకు పోలవరం చేరుకుంటారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2.25 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ