ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 26, గురువారం ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటుగా కుటుంబ సమేతంగా సిమ్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నట్లు తెలుస్తుంది. గురువారం ముందుగా తాడేపల్లి నివాసం నుంచి కుటుంబంతో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి సిమ్లా చేరుకోనున్నారు. అలాగే ఆగస్టు 30 లేదా 31న సీఎం వైఎస్ జగన్ తన పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ