తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.300 కోట్ల దళిత బంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇంతకుముందే మూడువిడతలుగా ప్రభుత్వం రూ.1,200 కోట్ల నిధులను విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన రూ.300 కోట్లు కలిపి మొత్తం రూ.1500 కోట్ల నిధులు విడుదలయ్యాయి.
త్వరలోనే మరో రూ.500 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తం రూ.2000 కోట్లతో నియోజకవర్గంలోని దళిత కుటుంబాలకు ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేయనుంది. మరోవైపు దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఆగస్టు 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా దళిత బంధు కింద 15 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ చెక్కులను అందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ