ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10328 కేసులతో కలిపి ఆగస్టు 6, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 196789 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) రికార్డ్ స్థాయిలో 63686 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో మరో 72 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వలన అనంతపూర్ జిల్లాలో పదిమంది, తూర్పుగోదావరిలో పదిమంది, గుంటూరులో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కృష్ణాలో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖపట్నంలో నలుగురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1753 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 112870 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 82166 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu