ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10830 పాజిటివ్ కేసులు, 81 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 26, బుధవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,82,469 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 3541 కి పెరిగింది. మరో 8473 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 61838 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన తూర్పుగోదావరిలో పదకొండు మంది, ప్రకాశంలో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడపలో ఎనిమిది మంది, అనంతపూర్ లో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3541 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 26, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 34,18,690
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 3,82,469
- కొత్తగా నమోదైనా కేసులు : 10830
- నమోదైన మరణాలు : 81
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 2,86,720
- యాక్టీవ్ కేసులు : 92208
- మొత్తం మరణాల సంఖ్య : 3541
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu