ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఇటీవల భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 86,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,354 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 2764, గుంటూరులో 2129, అనంతపూర్ లో 1882, తూర్పుగోదావరిలో 1842, శ్రీకాకుళంలో 1581, విశాఖపట్నంలో 1358, నెల్లూరులో 1133 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,01,690 కు చేరుకుంది.
ఇక కరోనా వలన నెల్లూరులో ఎనిమిదిమంది, విశాఖపట్నంలో ఎనిమిదిమంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, గుంటూరులో నలుగురు, కర్నూల్ లో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7992 కి పెరిగింది. గత 24 గంటల్లో 8468 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 9,70,718 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,22,980 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ