ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 91,120 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 18,285 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3296, అనంతపూర్ లో 1876, చిత్తూరులో 1822, విశాఖపట్నంలో 1800, పశ్చిమగోదావరిలో 1664, గుంటూరులో 1211, శ్రీకాకుళంలో 1207 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,27,390 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 96 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో పదిహేను మంది, పశ్చిమగోదావరిలో పద్నాలుగు మంది, విజయనగరంలో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఎనిమిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, కర్నూల్ లో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 10427 కి పెరిగింది. గత 24 గంటల్లో 24105 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 14,24,859 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ