తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3308 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 21, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,51,035 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 4723 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 5,04,970 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 91.64 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 21 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3106 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,959 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 513, ఖమ్మంలో 228, రంగారెడ్డిలో 226, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 203, కరీంనగర్ లో 161, సంగారెడ్డిలో 120, వరంగల్ అర్బన్ లో 116, మహబూబ్ నగర్ లో 116, సిద్ధిపేటలో 110, పెద్దపల్లిలో 101, మహబూబాబాద్ లో 100 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ