దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 45 ఏళ్లు పైబడినవారికి వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 11 నుంచి 45 ఏళ్లు పైబడినవారికి పనిచేసే ప్రదేశాల్లోనే కరోనా వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కరోనా వ్యాక్సినేషన్ సెషన్స్ నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది.
కనీసం 100 మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు సిద్ధంగా ఉంటే, ఆయా కార్యాలయాలను ఇప్పటికే ఉన్న కరోనా వ్యాక్సిన్ సెంటర్ తో ట్యాగ్ చేసి వ్యాక్సిన్ అందించాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లో కరోనా వ్యాక్సిన్ సెంటర్లను ఏప్రిల్ 11 నుండి ప్రారంభించుకోవచ్చని తెలిపారు. అలాగే ముందుగా ప్రభుత్వ/ప్రైవేట్ రంగ సంస్థల యజమానులు మరియు మేనేజ్మెంట్ తో తగిన సంప్రదింపులు జరపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ