ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మే 15, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2157 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9-9) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 9,038 సాంపిల్స్ ని పరీక్షించగా 102 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. వీటిలో 45 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకి చెందినవిగా (మహారాష్ట్ర 34, రాజస్థాన్ 11) పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 150 (మహారాష్ట్ర 101, గుజరాత్ 26, రాజస్థాన్ 11, ఒడిశా 10, పశ్చిమ బెంగాల్ 1, కర్ణాటక 1) మందికి కరోనా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు.
ఏపీలో కొత్తగా నెల్లూరు, చిత్తూరులో జిల్లాలలో 14 చొప్పున, కృష్ణాలో 9, కర్నూల్ లో 8, అనంతపూర్ లో 4, విజయనగరం లో 3, కడప, విశాఖపట్నంలో 2 చొప్పున, తూర్పు గోదావరిలో ఒక కేసుతో మొత్తం 57 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే చిత్తూరు జిల్లాలో నమోదైన 13, నెల్లూరులో 8, కర్నూల్ లో 5, కడప, అనంతపూర్ లలో ఒక్కో కేసుతో కలిపి మొత్తం 28 కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినవిగా చెప్పారు. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు 48 మంది మృతి చెందగా, మరో 1252 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక ప్రస్తుతం 857 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 14, గురువారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1414 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 40 మందికి, రంగారెడ్డి జిల్లాలో 5, వలస వచ్చిన వారికీ 10 మందితో కలిపి మొత్తం 47 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 34 మంది మృతి చెందగా, 952 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 428 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
#COIVDUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 57 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2157 పాజిటివ్ కేసు లకు గాను 1252 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 857.#APFightsCorona pic.twitter.com/fF3bLO0S4X— ArogyaAndhra (@ArogyaAndhra) May 15, 2020
Media bulletin
Date: May 14, 2020Status of positive cases of #COVID19 and also a list of districts with zero active cases in Telangana. pic.twitter.com/UsNpPX71tj
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 14, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu