ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 585 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 24, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,95,121 కు చేరింది. గత 24 గంటల్లో మరో 251 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన చిత్తూరు, గుంటూరు, కర్నూల్, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7197 కి పెరిగింది. గత 24 గంటల్లో 35066 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,48,40,401 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (మార్చి 24, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,95,121
- కొత్తగా నమోదైన కేసులు : 585
- కొత్తగా నమోదైన మరణాలు : 4
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,84,978
- యాక్టీవ్ కేసులు : 2946
- మొత్తం మరణాల సంఖ్య : 7197
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ