ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 20, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 9,159 సాంపిల్స్ ని పరీక్షించగా 68 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కోవిడ్ వలన కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 53 కి చేరింది. మరోవైపు 1639 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లోనే 43 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 715 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 19, మంగళవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1634 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 34 మందికి, వలస వచ్చిన వారిలో 8 మందితో కలిపి మొత్తం 42 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 38 మంది మృతి చెందగా, 1011 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 585 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2407 పాజిటివ్ కేసు లకు గాను 1639 మంది డిశ్చార్జ్ కాగా, 53 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 715. #APFightsCorona #COVID19Pandemic
— ArogyaAndhra (@ArogyaAndhra) May 20, 2020
Media bulletin
Date: May 19, 2020Status of positive cases of #COVID19 and also a list of districts with zero active cases in Telangana. pic.twitter.com/Lm1GjL1nkY
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 19, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu