ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో గురువారం నాడు కొత్తగా 9393 పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,396 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 3001 కి పెరిగింది. మరో 8846 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 55551 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన చిత్తూరులో పదహారు మంది, ప్రకాశంలో పదకొండు మంది, నెల్లూరులో తొమ్మిది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, పశ్చిమగోదావరిలో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఎనిమిది మంది, కడపలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3001 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 20, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 30,74,847
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 3,25,396
- కొత్తగా నమోదైనా కేసులు : 9393
- నమోదైన మరణాలు : 95
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 2,35,218
- యాక్టీవ్ కేసులు : 87177
- మొత్తం మరణాల సంఖ్య : 3001
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu