ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 9747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9747 కేసులతో కలిపి ఆగస్టు 4, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 176333 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) రికార్డ్ స్థాయిలో 64147 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో మరో 67 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వలన గుంటూరులో పన్నెండు మంది, కృష్ణాలో తొమ్మిది మంది, కర్నూల్ లో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1604 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 95625 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 79104 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu