ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9996 పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 13, గురువారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 264142 కు, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 2378 కి చేరింది. మరో 9499 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. గత 24 గంటల్లో 55692 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
కరోనా వలన గత 24 గంటల్లోనే తూర్పుగోదావరిలో పదిమంది, గుంటూరులో పది మంది, అనంతపూర్ లో ఎనిమిది మంది, కడపలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2378 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 13, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 27,05,459
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 264142
- కొత్తగా నమోదైనా కేసులు : 9996
- నమోదైన మరణాలు : 82
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 170924
- యాక్టీవ్ కేసులు : 90840
- మొత్తం మరణాల సంఖ్య : 2378
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu