ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. రాష్ట్రంలో కొత్తగా 8702 కరోనా పాజిటివ్ కేసులు, 72 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 8702 కేసులతో కలిపి సెప్టెంబర్ 17, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 6,01,462 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 77,492 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన చిత్తూరు జిల్లాలో పన్నెండు మంది, ప్రకాశంలో పది మంది, కడపలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, కర్నూల్ లో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5177 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 5,08,088 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 10712 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 88197 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu