ఏపీలో కరోనా: కొత్తగా 1520 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదు

AP Covid-19 Updates: 1520 New Positive Cases, 10 Deaths Reported Today

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారంఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 64,739 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,520 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 263, చిత్తూరులో 188, నెల్లూరులో 186, పశ్చిమగోదావరిలో 171, గుంటూరులో 162, కృష్ణాలో 159, ప్రకాశంలో 123 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,18,200 కు చేరుకుంది.

ఇక కరోనా వలన మరో 10 మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13887 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,290 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,89,391 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,922 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =