ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 17, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388 కు చేరుకుంది. గత 24 గంటల్లో 22,882 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 4108 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా విశాఖపట్నం జిల్లాలో 1018, చిత్తూరు జిల్లాలో 1004, గుంటూరు జిల్లాలో 345, కడప జిల్లాలో 295, తూర్పుగోదావరి జిల్లాలో 263, నెల్లూరు జిల్లాలో 261, ప్రకాశం జిల్లాలో 176, కృష్ణా జిల్లాలో 170, విజయనగరంలో 169, అనంతపూర్ జిల్లాలో 162, శ్రీకాకుళం జిల్లాలో 114, కర్నూల్ జిల్లాలో 85, పశ్చిమగోదావరిలో 46 కేసులు నమోదయ్యాయి.
ఇక రాష్ట్రంలో కరోనా వలన ఎలాంటి మరణం సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 14510 గా ఉంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 696 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,65,696 కు చేరింది. అలాగే ప్రస్తుతం 30,182 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జనవరి 17 నాటికీ ఏపీలో మొత్తం 3,18,84,914 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ