ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 33,944 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 415 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 93, కృష్ణాలో 76, పశ్చిమగోదావరిలో 53, గుంటూరులో 50, విశాఖపట్నంలో 36 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,64,287కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 6 మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణా జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14356 కి పెరిగింది. గత 24 గంటల్లో 584 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,45,276 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,655 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ