వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అక్టోబరు 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ముందుగా 7వ రోజు పాదయాత్రలో ఆగర్మియగూడ గ్రామ శివారులో మహిళలు వైఎస్ షర్మిలకు ఘనస్వాగతం పలికారు. అలాగే పాదయాత్ర సమయంలో కూడా నిరుద్యోగ వారంలో భాగంగా మంగళవారం దీక్షలు కొనసాగుతాయని వైఎస్ షర్మిల గతంలోనే ప్రకటించారు. అందులో భాగంగా ఆమె ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, తిమ్మాపూర్ గ్రామంలో నిరుద్యోగ నిరాహారదీక్షలో పాల్గొన్నారు. నిరుద్యోగ దీక్షలో భాగంగా ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఆమె దీక్షలో కూర్చున్నారు.
తిమ్మాపూర్ గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల స్పందిస్తూ, తెలంగాణలో ఏ ఒక్క వర్గం కన్నీరు కార్చకూడదనే తన పోరాటమని చెప్పారు. ప్రజలకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ప్రశ్నిస్తానని, వారి తరుఫున కడదాక ఎదురొడ్డి నిలబడతానని ఆమె పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ