ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 29,801 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 94 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 15, గుంటూరులో 12, పశ్చిమగోదావరిలో 11 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,306 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14488 కు చేరింది. గత 24 గంటల్లో 139 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,60,539 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,279 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఏపీలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 4కు చేరినట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రకటన చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ