తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులందరినీ పాస్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి, ప్రకటన చేశారు. తెలంగాణలో ఇటీవల విడుదల చేసిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలల్లో కేవలం 49% శాతం విద్యార్థులు మాత్రమే ఉతీర్ణత సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కొంత నిరసన వ్యక్తం అయింది. ఈ క్రమంలో విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఆదేశాలు మేరకు ఫెయిల్ అయిన (51 శాతం) మొదటి సంవత్సరం విద్యార్ధులందరినీ కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డుది ఎలాంటి తప్పు లేదని మంత్రి పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు తప్పు లేకున్నా నిందిస్తూ, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేయడం బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ముందుగా పోయిన సంవత్సరం కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ద్వితీయ సంవత్సరంలోకి ప్రమోట్ చేయటం జరిగింది. అయితే, ప్రభుత్వం గత నెలలో వారికి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించింది. ఇటీవలే ఆ ఫలితాలు విడుదల కాగా కేవలం 49% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలపై ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ