ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 95 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 21, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,974 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 26, గుంటూరులో 15, కడపలో 9, పశ్చిమగోదావరిలో 9, కృష్ణాలో 8, నెల్లూరులో 8 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 179 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 14481 కి పెరిగింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 21, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య : 3,10,38,740
- గత 24 గంటల్లో (9AM-9AM) నిర్వహించిన కరోనా పరీక్షలు : 27,233
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 20,75,974
- కొత్తగా నమోదైన కేసులు : 95
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 20,60,061
- యాక్టీవ్ కేసులు : 1,432
- మొత్తం మరణాల సంఖ్య : 14,481
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ