ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సమావేశాల్లో భాగంగా లోక్సభ కు హాజరైన బీఎస్పీ ఎంపీ కున్వార్ డానిష్ అలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునప్పటికీ, ఈరోజు నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నిన్న కూడా నేను పార్లమెంటుకు హాజరయ్యాను. నా కాంటాక్ట్లో వచ్చిన వారందరినీ పరీక్షించుకోవాలని మరియు ఇతరులతో వేరుగా ఉండి ఐసొలేషన్ ఉండాలని అభ్యర్థిస్తున్నాను. తేలికపాటి కరోనా లక్షణాలను కలిగి ఉన్నాను మరియు త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నాను” అని ఎంపీ కున్వార్ డానిష్ అలీ పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్ 23వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి.
Despite being fully vaccinated, today, I tested positive for #COVID19. Yesterday, I attended Parliament also. I request all those who came in my contact to get tested and isolate themselves. I am having mild symptoms and hope to recover soon. @loksabhaspeaker @LokSabhaSectt
— Kunwar Danish Ali (@KDanishAli) December 21, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ