ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే , ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అలాగే ఆమె భర్త, వైస్సార్సీపీ నేత పరిక్షిత్ రాజుకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వారు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతునట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏపీలో మే 10 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,02,589 కి చేరుకుంది. వీరిలో 11,04,431 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 1,89,367 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ