ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి గానూ ఆయన ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీసు మెడల్కు ఎంపికయ్యారు. ఈ మేరకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ అవార్డును ప్రకటించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు ‘ఉత్తమ సేవలు–2020’ సంవత్సరానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఈ పురస్కారం లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడ లోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో రేపు (ఆగస్టు) 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున డీజీపీకి ప్రదానం చేయనున్నారు. ఇక 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, డీజీపీగా బాధ్యతలు చేపట్టక మునుపు విజయవాడ నగర పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్, విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్తోపాటు వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY