ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ వలన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్ మరియు వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం నాడు ప్రకటించారు.
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:
- ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ – సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు
- ఈసెట్ – సెప్టెంబర్ 14
- ఐసెట్ – సెప్టెంబర్ 10, 11
- పీజీ ఈసెట్ – సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు
- ఎడ్సెట్ – అక్టోబర్ 1
- లాసెట్ – అక్టోబర్ 1
- పీఈసెట్ – అక్టోబర్ 2 నుంచి 5 వరకు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu