ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 648 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 51, విదేశాల నుంచి వచ్చిన వారు ఐదుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన 704 కేసులతో కలిపి జూన్ 30, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14595 కు చేరింది. గత 24 గంటల్లో 18,114 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
మరోవైపు కృష్ణాలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, గుంటూరులో ఒకరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 187 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 6511 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6161 మంది ఆసుపత్రుల్లో, 1736 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 7897 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ