ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఏపీకి మరో 9 లక్షల కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. ముందుగా పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. అనంతరం వాటిని రోడ్డు మార్గంలో గన్నవరంలోని రాష్ట్ర వ్యాక్సిన్ నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కేటాయింపు ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలకు తరలించనున్నారు.
ఏపీలో ప్రస్తుతం కరోనా మూడో వేవ్ ను దృష్టిలో ఉంచుకుని 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలున్న తల్లులకు మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా కట్టడిలో వాక్సినేషన్ చాలా ముఖ్యమైనదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చే వాక్సిన్లను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని, నిర్దేశించుకున్న విధివిధానాల ప్రకారం వాక్సినేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ