మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు గల్లా అరుణకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితం ముగిసిందని ప్రకటించారు. అయితే తన కుమారుడు గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా గుంటూరు నుంచి పనిచేస్తున్నాడని, కావున టీడీపీకి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. తవణంపల్లి మండలం దిగువమాఘంలో తమ సొంత కంపెనీ అమరరాజా నైపుణ్యాభివృద్ధి భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం గల్లా అరుణకుమారి మీడియాతో మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితం ముగిసింది. నేను చేయని పదవి లేదు, చూడాని రాజకీయం లేదని చెప్పారు. నా అనుచరులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, వారికి ఏ పార్టీలో భవిష్యత్ ఉంటుందో వాళ్లు అక్కడకు వెళ్లొచ్చని సూచించారు. టీడీపీకి మేము కాదు పెద్ద దిక్కు, చంద్రబాబే పార్టీకి పెద్ద దిక్కు అని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కు చెందిన గల్లా అరుణకుమారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY