ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి పరీక్ష ఫలితాల విడుదల జూన్ 6, సోమవారానికి వాయిదా పడింది. ముందుగా పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ 4, శనివారం విడుదల చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ శనివారం ఉదయం 11గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు తెలిపారు. అయితే అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లుగా తాజాగా అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 6,21,799 మంది విద్యార్థిని, విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు.
మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. 2019 తరువాత ఈ ఏడాదే పరీక్షలు నిర్వహించారు. పదో తరగతిలో ఏడు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించడంతో పాటుగా, తొలిసారిగా సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ను అందించారు. అలాగే ఈసారి గ్రేడ్స్ రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫలితాలను సోమవారం నాడు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF