తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుత పాలకమండలి పదవీకాలం జూన్ 21 తో పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీకి స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. స్పెసిఫైడ్ అథారిటీ కింద ఈవో కేఎస్ జవహర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గానూ, అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి కన్వీనర్ గానూ వ్యవహరించనున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు పాలక మండలికి ఉండే అన్ని అధికారాలు స్పెసిఫైడ్ అథారిటీకి ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు త్వరలోనే కొత్త పాలకమండలి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ