ఏపీలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, AP Corona News, ap coronavirus news today, AP Government, AP Government has Reduced Corona Test Price in Private Labs, AP govt reduces corona test price, Corona Test Price, Corona Test Price in Private Labs, Corona Test Price Reduced In AP

రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కరోనా పరీక్షల నిర్వహణకు కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ కు అనుమతించి, ధరలను నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ కు చెల్లించే ధరలను కుదిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్ట్ ధరలు తగ్గింపుపై ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ ను టెస్ట్ చేసేందుకు రూ.2400 ధర చెల్లిస్తుండగా, ప్రస్తుతం 1600 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రైవేట్‌ ల్యాబ్స్ లో టెస్ట్ కోసం గతంలో రూ.2900 రూపాయల ధరను నిర్దేశించగా, ప్రస్తుతం 1900 తగ్గిస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా పరీక్షల కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతో ధరలు తగ్గించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + four =