అమరావతి నిర్మాణానికి భూసేకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుకు సంబంధించి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు వార్షిక కౌలు మరియు రెండు నెలల పెన్షన్ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వార్షిక కౌలు కింద రూ.158 కోట్లు, అలాగే రెండు నెలల పెన్షన్ 9.73 కోట్లను సంబంధిత రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగస్టు 27, గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, సాంకేతిక సమస్యల వల్లే రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ఆలస్యం జరిగిందని అన్నారు. ఈ విషయంపై ప్రజలను రెచ్చగొట్టి, ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. అలాగే భూహక్కు పత్రాలను అమ్ముకున్న రైతులకి కౌలు చెల్లింపులు ఉండవని మంత్రి బొత్స పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu