తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలు దాటగా, కరోనా మరణాలు 7 వేలకు చేరువలో ఉన్నాయి. ఆగస్టు 27, గురువారం నాడు ఒక్కరోజే 5981 కేసులు, 109 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,03,242 కి, మరణాల సంఖ్య 6,948 కు చేరింది. అలాగే కరోనా నుంచి కొత్తగా 5,870 మంది కోలుకోవడంతో, డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 3,43,930 కు చేరుకుంది. ప్రస్తుతం 52,364 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాటికీ తమిళనాడు రాష్ట్రంలో 44,98,706 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu