టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న పీవీ సింధు, రజనీ, సాయిరాజ్‌లను సన్మానించిన ఏపీ గవర్నర్

Andhra Governor honours Olympians, Andhra Pradesh proud of Olympians, AP Governor Biswabhusan Harichandan Felicitated PV Sindhu, AP Governor Biswabhusan Harichandan Felicitated PV Sindhu Rajani Sairaj at Rajbhavan, Biswa Bhusan Harichandan, biswabhusan harichandan, Biswabhusan Harichandan Felicitated PV Sindhu, Biswabhusan Harichandan Felicitated Rajani Sairaj, Governor felicitates Rajani Sindhu, Mango News, PV Sindhu Olympic Star Player Felicitated by AP Governor, Rajani Sairaj, Rajbhavan

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి దేశం తరపున టోక్యో ఒలింపిక్స్-2020లో పాల్గొన్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు), ఆర్‌.సాత్విక్‌ సాయిరాజ్ మరియు హాకీ క్రీడాకారిణి రజనీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నాడు రాజ్ భవన్ లో ఘనంగా సన్మానించారు. వారు తమ విజయాల పట్ల దేశమంతా గర్వపడేలా చేశారని, భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు.

పీవీ సింధు వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిందని అన్నారు. అలాగే భారత మహిళా హాకీ జట్టు క్రీడాకారిణి రజనీ, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్‌ సాయిరాజ్ పోరాటపటిమ, సంకల్పాన్ని గవర్నర్ అభినందించారు. వారు ఒలింపిక్స్‌లో పతకం నెగ్గకపోవచ్చు కానీ, అత్యుత్తమ ప్రదర్శనతో ప్రతి భారతీయుడి హృదయాలను గెలుచుకున్నారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 12 =