ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డి పేర్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా చెన్నారెడ్డి, హరిప్రసాద్ పేర్లను ఖరారు చేసి, ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపించారు.
ఇకపై రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలును వీరిద్దరూ పర్యవేక్షించనున్నారు. కాకర్ల చెన్నారెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేట్, లాలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లా కోర్టుల్లో, రెండు రాష్ట్రాల హైకోర్టుల్లో 15 ఏళ్లుగా న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఇక ఉల్చాల హరిప్రసాద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే రెండు దశాబ్ధాల నుంచి పత్రికారంగంలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ