ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేబినెట్‌ హోదా

AP Govt Appoints MLA Malladi Vishnu as Planning Board Vice Chairman To Get Cabinet Rank, AP Govt Cabinet Board Vice Chairman MLA Malladi Vishnu , Planning Board Vice Chairman Cabinet Rank, MLA Malladi Vishnu, AP Government, Mango News, Mango News Telugu, Cabinet Rank, Planning Board Vice Chairman, MLA Malladi Vishnu Latest News And Updates, AP Planning Board Vice Chairman, AP CM YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ సెంట్రల్‌​ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రప్రదేశ్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఆయనకు కేబినెట్‌ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మల్లాది విష్ణు ఈ పదవిలో రెండేళ్ల పాటు ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. అయితే ఏపీ కేబినెట్ పునర్వవ్యవస్థీకరణతో పాటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో.. అధికార వైసీపీ లోని కొందరు ఎమ్మెల్యేలకు నామినేటడ్ పదవులు కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

దీనిలో భాగంగా పార్టీని నమ్ముకున్నవారికి, అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ గా మల్లాది విష్ణును నియమించారు. కాగా మల్లాది విష్ణు తొలినుంచి సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. సీఎం జగన్ తండ్రి, నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అనుచరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. జగన్ మోహన్ రెడ్డి వైసీపీని ప్రారంభించాక ఆయన వెంట నిలిచారు. ఈ క్రమంలో గత 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా ప్రభుత్వం తాజా నిర్ణయంతో మల్లాది విష్ణుకు కేబినెట్‌ హోదా దక్కింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =