కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఎన్నికల వాయిదా నిర్ణయంపై మార్చ్ 16, సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఏపీలో ఎన్నికల వాయిదా అంశాన్ని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు ముందుంచారు. విచారణ నిమిత్తం జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించగా, దీనిని రేపటి కేసుల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ను జస్టిస్ లలిత్ ఆదేశించారు. ఎన్నికల వాయిదా అంశంపై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఎన్నికల వాయిదా అంశంపై లంచ్మోషన్లో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం ఈ రోజు మధ్యాహ్నం విచారించే అవకాశం ఉంది.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం
[subscribe]