ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొత్తగా 10171 కరోనా పాజిటివ్ కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూల్ లో 1331, తూర్పుగోదావరిలో 1270, అనంతపూర్ లో 1100 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూల్, అనంతపూర్, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలలోనే కేసులు అధికంగా నమోదయ్యాయి. ఆగస్టు 5, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 206990 కు చేరింది. మరో 7594 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 120464 కి చేరింది. ప్రస్తుతం 84654 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1842 కి చేరుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu