కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ఆగస్టు 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించిన అనంతరం నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు. ప్రజలందరూ కరోనా ప్రోటోకాల్స్, నైట్ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ