కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ మరో రెండు వారాలు పాటుగా అనగా ఫిబ్రవరి 14వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. నైట్ కర్ఫ్యూ పొడిగింపుపై ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు. ప్రజలందరూ నైట్ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడితే విపత్తు నిర్వహణ చట్టం-2005 లోని 51 నుంచి 60 సెక్షన్లు, ఐపీఎస్ సెక్షన్ 188 మరియు సంబంధిత ఇతర చట్టాలు కింద చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలకు ప్రభుత్వం సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ