ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థుల స్టైఫండ్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో ఇతర కోర్సుల స్టైఫండ్ పంపుపై ఆగస్టు 12, బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
పెంచిన స్టైఫండ్ వివరాలు:
- ఎంబీబీఎస్/బీడీఎస్ విద్యార్థులకు – రూ.19,589
- పీజీ డిగ్రీ విద్యార్థులకు మొదటి ఏడాది – రూ.44,075
- పీజీ డిగ్రీ విద్యార్థులకు రెండో ఏడాది రూ.46,524
పీజీ డిగ్రీ విద్యార్థులకు మూడో ఏడాది రూ.48, 973 - పీజీ డిప్లొమా విద్యార్థులుకు మొదటి ఏడాది – రూ.44,075
- పీజీ డిప్లొమా రెండో ఏడాది రూ.46524
- సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు మొదటి ఏడాది – రూ.48,973
- సూపర్ స్పెషలిటీ రెండో ఏడాది – రూ.51,422
- సూపర్ స్పెషలిటీ మూడో ఏడాది – రూ.53,869
- ఎండీఎస్ విద్యార్థులకు మొదటి ఏడాది – రూ.44,075
- ఎండీఎస్ రెండో ఏడాది – రూ.46,524
- ఎండీఎస్ మూడో ఏడాది – రూ.48,973
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu