దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగించడం సహా పలు అన్లాక్ 2.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్లాక్ 2.0 మార్గదర్శకాలు అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 2, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కూడా జూలై 31 వరకు కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు అమలు చేయాలని, అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu