తెలంగాణ రాష్ట్రంలో మరో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 1, బుధవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,357 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 4234 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన ఏడుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 267 కి పెరిగినట్టు తెలిపారు. కోవిడ్ నుంచి మరో 788 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 8082 కి చేరింది. ప్రస్తుతం 9008 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1018):
- జీహెచ్ఎంసీ ఏరియా – 881
- మేడ్చల్ – 36
- రంగారెడ్డి – 33
- మహబూబ్ నగర్ – 10
- మంచిర్యాల – 9
- వరంగల్ రూరల్ – 9
- ఖమ్మం – 7
- నల్గొండ – 4
- జగిత్యాల – 4
- నిజామాబాద్ – 3
- సిద్దిపేట – 3
- సూర్యాపేట – 2
- కామారెడ్డి – 2
- ములుగు – 2
- ఆసిఫాబాద్ – 2
- సంగారెడ్డి – 2
- కరీం నగర్ – 2
- మెదక్ – 2
- ఆదిలాబాద్ – 2
- యాదాద్రి – 2
- గద్వాల్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu